నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 20:53

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

•టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

శాలిగౌరారం మండలంలోని ఉట్కూర్ గ్రామంలోని వినాయక మండపాల వద్ద టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయకుని నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ తమ భక్తి భావాన్ని చాటుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు పాకాల సతీష్ ,మాదారం ఎంపిటిసి నోముల జనార్ధన్ యాదవ్, ఆకారం సర్పంచ్ సమరం రెడ్డి,

ఊట్కూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కుర్ర లింగయ్య, వార్డ్ మెంబర్ గుండ్లు వినోద-సైదులు,ఎన్ ఎస్ యు ఐ మండల ఉపాధ్యక్షుడు కట్లకుంట్ల రమేష్,మో దాల రమేష్, సీనియర్ నాయకులు రంగు రాములు,కప్పల శ్రీకాంత్, భూపతి శ్రీనివాస్ , శీలం శంకర్, రంగు బిక్షం,వేముల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 20:49

పెంచిన వేతనాలు ఏరియార్స్ తో సహా చెల్లించాలి

పెంచిన వేతనాలు ఏరియార్స్ తో సహా చెల్లించాలి

•28 నుండి నిరవధిక సమ్మె

మధ్యాహ్న భోజన కార్మికులకు జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో సహా సెప్టెంబర్ సెప్టెంబర్ 27 లోపు చెల్లించని యెడల 28 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.

సోమవారం నల్గొండ మండలం లోని కంచనపల్లి, నల్లగొండ మాధవ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లకు సమ్మె నోటీసులు అందజేశారు.

ఈ సందర్భంగా సత్యనారాయ మాట్లాడుతూ 2022 మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి నేటికీ అమలు చేయలేదని అన్నారు.

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మూడు రోజుల టోకెన్ సమ్మె చేసిన సందర్భంగా 2023 జూలైలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కరుణ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వేతనాలు పెంచుతున్నామని మరోసారి ప్రకటించారు.

జీవో నెంబర్ 8 విడుదల చేస్తూ పెంచిన 2000 రూపాయల వేతనం నేటి నుండి అమలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమైందని నేటికీ అవి ఇవ్వలేదని అన్నారు.

అతి తక్కువ పెంచిన రెండువేల తో కలిపి నెలకు 3000 రూపాయల వేతనంతో ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కొత్త మెనూ ప్రకారం రేట్లు పెంచి బడ్జెట్ విడుదల చేయాలని అవసరమైన చోట వంట సామాగ్రి, సబ్సిడీపై గ్యాస్, కాటన్ యూనిఫామ్స్ ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు ఇతర సమస్యలు పరిష్కరించని ఎడల సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నలగొండ పట్టణ మండల నాయకులు ఇటికాల అనిత నిమ్మల కవిత ఇటికాల మమత సైదమ్మ సునీత కృష్ణమ్మ భాగ్యలక్ష్మి రేణుక మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:33

గ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దు పై టిఎస్పిఎస్ పి పిటిషన్ దాఖల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్క మిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై సోమవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు టిఎస్‌పిఎస్‌సి న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది.

ఇప్పటి కే ఒకసారి రద్దయిన గ్రూప్1 ప్రిలిమ్స్, కోర్టు తీర్పుతో రెం డోసారి రద్దయితే.. అభ్యర్థులు మానసికంగా తీవ్ర ఆం దోళనకు గురవుతారని కమిషన్ భావిస్తోంది.ఈ మేరకు డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికల నిర్వహణ విధుల్లో నిగమ్నమైపోతుంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే దాదాపు 2024లోనే మళ్లీ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది.

అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఒకసారి రద్దు కావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పు డు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందేమో అని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడా ది ఏప్రిల్‌లో గ్రూప్1 నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో వెలువడిన గ్రూప్ 1 ప్రిలి మ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది...

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:30

పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా

పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు అంతు చి క్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు.

తాజాగా ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు నిజం బయటపడింది.

ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి సరఫరా చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. చేసేది లేక నిందితులు వాహనం వదిలేసి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న ఇటుకలను తొలగిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇటుకల కింద ఉంచిన ఒక్కో ప్యాకెట్ లో ఐదు కిలోల గంజాయి చొప్పున 5 క్వింటాలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాహనంతో పాటు గంజాయిని పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లినట్టు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుంటే ఎక్కడినుండి ఎక్కడికి గంజాయి సరఫరా చేస్తున్నారని అంశం బహిర్గతం అవుతుంది...

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:28

AP News: చలో విజయవాడ.. మారువేషాల్లో విజయవాడకు అంగన్వాడీలు..

విజయవాడ: వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, అధికారులు వేధింపులు తగ్గించాలి తదితర డిమాండ్లతో 'చలో విజయవాడ'కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు..

'చలో విజయవాడ'కు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మారువేషాల్లో అంగన్వాడీలు విజయవాడకు చేరుకుంటున్నారు.

కొంతమందిని విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు ప్రైవేటు కల్యాణ మండపాలకు తరలించారు.

అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ 'చలో విజయవాడ'ను విజయవంతం చేస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.

అంగన్వాడీల అరెస్టులను వామపక్షాలు ఖండించాయి..

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:25

నారా బ్రాహ్మణి ని కలిసిన ఐటి ఉద్యోగులు

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు నారా బ్రాహ్మణిని సోమవారం కలిశారు.

టిడిపి అధినేత చం ద్రబాబు నాయుడు అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చా లా బాధకలిగిస్తోందని వారు బ్రాహ్మణితో ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ఐటి రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యో గాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య అని అన్నారు.

చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని ఐటి ఉద్యోగులు పేర్కొన్నారు...

SB NEWS

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:22

మైనంపల్లి ఇంటికి కాంగ్రెస్ నేతల క్యూ

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మల్లురవి తదితరులు వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా మైనంపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి ఈ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.

కాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయి.

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇందుకు ఈనెల 27న ముహూర్తం కుదిరిందని మైనంపల్లి సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి మెదక్‌ సీటును తన కుమారుడు రోహిత్‌కు కేటాయించాలంటూ గతంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముందు మైనంపల్లి ప్రతిపాదన పెట్టారు.

అయితే మైనంపల్లిని మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. మెదక్‌ సీటును సిటింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికే ఇచ్చారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపైన, పార్టీ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. మల్కాజిగిరి టికెట్‌నూ నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.ఇదే క్రమంలో మైనంపల్లి తో కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సంప్రదింపులు జరుపుతున్నారు.

తనకు మల్కాజిగిరితో పాటుగా తన కుమారునికి మెదక్‌ సీటునూ కేటాయించాలంటూ మైనంపల్లి ప్రతిపాదించారు....

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:19

తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా వచ్చే నెల 24వ తేదీ నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నది.

దీంతో ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.

సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ

మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ

బుధవారం – బొంబాయి రవ్వ ఉప్మా, సాంబార్

గురువారం – రవ్వ పొంగల్, సాంబార్

శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్

శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.

ఈ పథకం ప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...

SB NEWS

STREETBUZZ NEWS

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:14

ప్రగతిభవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు

తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడుతున్న నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు ప్రయత్నించారు.

దీంతో ప్రగతి భవన్ పరిసరాలు అట్టుడికి పోయాయి. నాన్ స్పౌస్ ఉపాధ్యాయ బాధితులు తమను స్థానిక జిల్లాలకు పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి ఇచ్చేందుకు ప్రగతి భవన్ వద్దకు వెళ్లినట్టు పలువురు టీచర్లు చెబుతున్నారు.

వినతిపత్రం ఇవ్వడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు బయలుదేరారు. పోలీసుల బారికేడ్లను కూడా ఛేదించుకుని ప్రగతి భవన్ సమీపం వరకు చేరుకున్నారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.

పోలీసులు అడ్డుకోవడంతో టీచర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. పలువురు కేసీఆర్ మాస్కులను ధరించి మూకుమ్మడిగా ప్రగతి భవన్ రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.

స్థానికత పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అనే అంశమే పరిహాసంగా మారిందని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు...

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:09

భారత్ కు తొలి స్వర్ణ పతకం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది .

రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా 1890.1 స్కోర్‌, సిల్వర్‌ మెడల్‌ సొం‍తం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది..